ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి కమిటీతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2డీ -ఎకో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో పెట్టామని, వీటిని మరింత విస్తృతంగా వినియోగించాలన్నారు. డయాగ్నస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని రకాల పరీక్షలను పకడ్బందీగా, వేగంగా నిర్వహించాలన్నారు.

సదరం క్యాంపులు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్వహించి, దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. వేములవాడ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోకాలు ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నారని, సిరిసిల్లలోనూ ఇలాంటి ఆపరేషన్లు జరగాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే వేడుకలకు జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్పీ మహేశ్ బి. గీతే, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రజిత, జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.